
ఆకేరు న్యూస్ ములుగుః జిల్లాలో వ్యాప్తంగా 26,454 మంది రైతుల ఖాతాల్లో రూ.219 కోట్ల నిధులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. మండలాల వారీగా ఏటురునాగారం మండలంలో 2,044 మంది రైతులకు 18.కోట్ల 92 లక్షలు, గోవిందరావుపేట మండలంలో 2,185 మంది రైతులకు 16 కోట్ల 62 లక్షలు ,కన్నాయిగూడెం మండలంలో 1,625 మంది రైతులకు 11 కోట్ల 08 లక్షలు, మంగపేట మండలంలో 3,975 మంది రైతులకు 36 కోట్ల 33 లక్షలు, తాడ్వాయి మండలంలో 1,797 మంది రైతులకు 13 కోట్ల 78 లక్షలు, వెంకటాపురం మండలంలో 2,305 మంది రైతులకు 15 కోట్ల 51 లక్షలు, వాజేడు మండలంలో 2,286 మంది రైతులకు 20 కోట్ల 96 లక్షలు ,ములుగు మండలంలో 6,187 మంది రైతులకు 53 కోట్ల 71 లక్షలు, వెంకటాపూర్ మండలంలో 4,050 మంది రైతులకు 32 కోట్ల 06 లక్షల రుణ మాఫీ నిధులు వారి ఖాతాలలో జమ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో లబ్ధిదారుల జాబితా ప్రతి గ్రామపంచాయతీలో మూడు ప్రధాన కూడలిలలో ఫ్లెక్సీ ల రూపంలో పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు.
………………………………………………