* జాతర తేదీలు ప్రకటించిన ఆలయ పూజారులు
ఆకేర న్యూస్ మేడారం : ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన
సమ్మక్క సార క్క జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 28న సయ్మక్క జాతర ప్రారంభం కానుంది. 2026 బుధవారం జనవరి 28 న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారితో సహా గోవింద రాజు,పగిడిద్ద రాజులు గద్దెల పైకి వస్తారు. 29 గురవారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారని ఆలయ పూజారులు తెలిపారు.30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.31 శనివారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మఅమ్మవార్లు గోవిందరాజు పగిడిద్ద రాజులు తిరిగి వన ప్రవేశం చేస్తారని పూజారి సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఒక ప్రకటనలో తెలిపారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
