
* హన్స్ ఇండియా పత్రిక వరంగల్ బ్యూరో చీఫ్
* గత కొంతకాలంగా అనారోగ్యం
ఆకేరు న్యూస్, హనుమకొండ : సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ ( 55 ) గురువారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు . గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హన్స్ ఇండియా దిన పత్రికలో గత పది హేను సంవత్సరాలు గా ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్ గా కొనసాగుతున్నారు. మహేందర్ కు కుమారుడు ,భార్య ఉన్నారు. కిషన్ పుర లోని శ్రీ లక్ష్మీ ( సింహాల గేటు ) ఆస్పత్రి లో మృత దేహాన్ని భద్ర పరిచామని బంధువులు తెలిపారు..ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. తన దైన శైలిలో అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారు. హైదరాబాద్ , ఖమ్మం జిల్లాలో జర్నలిస్ట్ గా పని చేశారు .. కాగా సీనియర్ జర్నలిస్ట్ మహేందర్ మృతి కి పలువురు సీనియర్ జర్నలిస్ట్ లు ,జర్నలిస్ట్ సంఘాల నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
…………………………………………