Eye Donation Awareness station ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లికి చెందిన అరిశేల వెంకటమ్మ (78) సోమవారం మృతి చెందారు. అరిశేల వెంకటమ్మ కుమారుడు రవి తన మాతృమూర్తి మరణానంతరం ఎల్వి ప్రసాద్ రీజినల్ కంటి ఆసుపత్రి (హన్మకొండ)కి తన తల్లి నేత్రదానం చేశారు. డాక్టర్ జి. నరేందర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో మృతురాలు రెండు కన్నులను దానం చేశారు. కార్యక్రమం కొడుకు కోడలు అల్లుళ్ళు బిడ్డలు రవి, రమ, యాదగిరి, శంకర్, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.
