Rajiv Gandhi Death Anniversary Rajavaram
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో గురువారం నిర్వహించారు. జిల్లా నాయకులు మోటం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల ఎల్లయ్య, చిల్పూర్ దేవస్థాన పాలక మండలి డైరెక్టర్లు బత్తుల సూర్యనారాయణ, ఎడ్ల యాదగిరి, పార్టీ సీనియర్ నాయకులు జక్కుల రాజయ్య, రావుల రమణ రెడ్డి, బత్తుల దేవదాసు, పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి మచ్చ మొగిలి, చిల్పూర్ దేవస్థాన పాలక మండలి మాజీ డైరెక్టర్ సాయి రామ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల రాజశేఖర్, గనగోని రమేష్ , యాకూబ్, గౌస్, అక్బర్, మచ్చ రమేష్, పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎడ్ల మొగిలి, సంగి నర్సయ్య, జక్కుల వెంటయ్య, అంగడి వెంకయ్య, ఎడ్ల మొండయ్యా, యూత్ ఉపాధ్యక్షులు కన్నేబోయిన కుమార్, ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
