Tamil Nadu CM Vijay UK Visit
* పెట్టుబడులే లక్ష్యంగా..
* యూకేకు వెళ్లనున్న తమిళనాడు సీఎం
* సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు పర్యటన..
* వ్యాపార ప్రముఖులతో సమావేశాలు
ఆకేరు న్యూస్, చెన్నై: ప్రధాన పారిశ్రామిక, మూలధన పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో విజయ్ యూకే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు తమ రాష్ట్రాలను ప్రాధాన్య గమ్యస్థానాలుగా నిలబెట్టేందుకు రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే.
* పెట్టుబడిదారులతో కీలక భేటీలు
6 రోజుల పర్యటనలో వివిధ పరిశ్రమలకు చెందిన వ్యాపార ప్రముఖులు, పెట్టుబడిదారులు, ప్రతినిధులతో విజయ్ సమావేశం కానున్నారు. తమిళనాడులో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి వివరించడంతో పాటు, కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు తమిళనాడును గమ్యస్థానంగా ఎంచుకునేలా కంపెనీలను ప్రోత్సహించడంపై చర్చలు జరపనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ పర్యటనను చేపడుతున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కూడా యూకేలో జరిగే సమావేశాల్లో చర్చించనున్నారు.
* తైవాన్కు తమిళనాడు బృందం
మరోవైపు మంత్రి కీర్తన నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి బృందం సెప్టెంబర్ 4న తైవాన్కు వెళ్లనుంది. ప్రధాన సెమీ కండక్టర్ పరిశ్రమ కార్యక్రమమైన సెమీకాన్ తైవాన్ 2026లో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. సీఎం విజయ్ చేపట్టనున్న తొలి విదేశీ పెట్టుబడి సంబంధిత పర్యటనగా యూకే పర్యటన నిలవనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
