* గూడ్స్ రైలును ఢీకొన్న మైసూర్ దర్భంగా ఎక్స్ప్రెస్
* విమాన ఎమర్జెన్సీ ల్యాండిరగ్ ఘటన జరిగిన తమిళనాడులోనే రైలు ప్రమాదం కూడా..
ఆకేరు న్యూస్, డెస్క్: చెన్నై శివారులో, తిరువళ్లూరులో రైలు ప్రమాదం జరిగింది. కవరాయ్ పెట్టాయ్ రైల్వే స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ (12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. 6 బోగీలు పట్టాలు తప్పగా. వాటిలో రెండు బోగీలకు మంటలు అంటుకున్నాయి. బోగీల మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు గాయపడగా.. కొంతమంది బోగీల్లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించారు. రైలు ఢీకొట్టినప్పుడు దాని వేగం గంటకు 109 కిలోమీటర్లుగా చెబుతున్నారు. లూప్లైన్ లోకి వెళ్లిన ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల చెన్నై, నెల్లూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైలు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు చెన్నైలో హెల్ప్ లైన్ నంబర్లు 044 25354151, 044 24354995 ఏర్పాటు చేశారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
