వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
* వేలాంకిణికి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : క్రిస్మస్ నేపథ్యంలో వేలాంకిణి చర్చిలో ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం సికింద్రాబాద్-వేలాంకిణి (Secunderabad-Velankani)మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు ఈ నెల 23న (మంగళవారం) రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30గంటలకు వేలాంకిణి చేరనుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో 07408 ప్రత్యేకరైలు ఈ నెల 25న (గురువారం) ఉదయం 8గంటలకు వేలాంకిణిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో ఈ ప్రత్యేకరైళ్లు చర్లపల్లి, నల్గొండ(Nalgonda), మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు(Guntur), తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, మెల్మారువతుర్, విల్లుపురం, కారైకల్, నాగపట్నం తదితర స్టేషన్లలో (ఇరువైపులా)ఆగుతుందని పేర్కొన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
