ఆకేరు న్యూస్ డెస్క్ ః అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా ఖాన్ షిన్వారీ తీవ్ర అనారోగ్యంతో
17 మార్చి 1984లో షిన్వారీ అప్ఘనిస్తాన్ లో జన్మించారు. 2017లో క్రికెట్ అంపైరింగ్ లో అడుగుపెట్టిన షిన్వారీ ఇప్పటి వరకు 34 అంతర్జాతీయ వన్డేలకు 26 టీ ట్వంటీ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు.మొతంగా 60 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించాడు. 2020 అక్టోబర్ 3న అప్ఘనిస్తాన్ లోని నంగర్ హార్ లో జరిగిన కారు బాంబు పేలుడులో షిన్వారీ మృతి చెందాడనే వందంతులు వ్యాపించాయి. అయితే తాను పేలుడి ప్రదేశంలో లేనని సురక్షితంగా ఉన్నాని ఆ తరువాత షిన్వారీ స్వయంగా నిర్ధారించాల్సి వచ్చింది. బిస్మిల్లా ఖాన్ షిన్వారీ మరణం క్రికెటర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఆయన మరణం క్రికెట్ రంగానికి తీరని లోటని పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
