* హన్మకొండ సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెంకటరమణ
ఆకేరున్యూస్, హన్మకొండ: రాబోయే వేసవికాలానికి విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా అన్ని రకాల ముందస్తుచర్యలు తీసుకుంటున్నామని హన్మకొండ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.వెంకటరమణ తెలిపారు. ఇందులో భాగంగా నేడు హనుమకొండలోని న్యూ శాయంపేట సబ్ స్టేషన్లో 5 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ నుండి 8 యంవీయే పవర్ ట్రాన్స్ఫార్మర్ కు పెంచామని అన్నారు. ఇది వరకు 8 యంవీయే పవర్ ట్రాన్స్ఫార్మర్తో పాటు ఇది అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీంతో మొత్తం 16 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెరిగిందని చెప్పారు. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెంచడం వలన వేసవిలో లోడ్ ఎంత పెరిగిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా తీసువల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ టౌన్ డిఈ జి. సాంబరెడ్డి, ఏడిఈ పి. మల్లికార్జున్, జానకి రాంరెడ్డి, దర్శన్ కుమార్, ఏఈ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
