
* ఉత్తర్వులను తెలుగులో జారీ చేసిన ప్రభుత్వం
* ఆ భూములకు రైతు భరోసా కట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసాకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడనున్నాయి. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో విడుదల చేసింది.
కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవే..
* ఏడాదికి ఎకరాకు రూ. 12 వేల చొప్పున పెట్టుబడి సాయం
* భూభారతిలో నమోదైన సాగుయోగ్యమైన భూములకే భరోసా
* భూ విస్తీర్ణంగా ఆధారంగా పట్టాదారులకు భరోసా
* సాగుయోగ్యం కాని భూములను రైతు భరోసాను నుంచి తొలగింపు
* ఆర్ వో ఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా
* ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగింత
* రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు అమలు చేస్తారు.
* ఎన్ఐసీ, హైదరాబాద్ వారు ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
…………………………………………