
* లారీ బోల్తా పడడంతో 10 మంది రైతులు దుర్మరణం
ఆకేరు న్యూస్, డెస్క్ : కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. లారీ బోల్తా పడి 10 మంది రైతులు (Former) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. కూరగాయల లోడ్తో వెళ్తుండగా లారీ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక(Karnataka)లోని సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న 50 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………