
ఆకేరున్యూస్, మహారాష్ట్ర: అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు జనావాసాల్లోకి ప్రవేశించడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా షారుక్ ఖాన్ చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చోటు చేసుకుంది. కాగా, ఇక్కడ షారుక్ ఖాన్ అంటే బాలీవుడ్ సెలబ్రిటీ కాదు.. ఆ పేరుగల ఓ సామాన్య వ్యక్తి. అతడు మంగళవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్పై వెళ్తుండగా రహదారిపై చిరుత ప్రత్యక్షమవగా ఒక్కసారిగా భయాందోళనకు గురై తప్పించుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై వాలివ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపడుతున్నారు.
…………………………………….