* కులగణనపై విమర్శలు చేసేవారు పునరాలోచించండి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్పై : కులగణనపై దాడిని బీసీల దాడిగానే చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కులగణనపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని సూచించారు. కులగణన సర్వే పూర్తయిన నేపథ్యంలో ఆయన గాంధీభవన్(Gandhibhavan)లో మీడియాతో మాట్లాడారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని విపక్షాలను కోరారు. నిర్ణీత గడువులోగా కులగణన సర్వే చేసిన యంత్రాగానికి అభినందనలు తెలిపారు. కులగణనకు స్ఫూర్తినిచ్చిన రాహుల్గాంధీ(Rahulgandhi)కి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జనాభా దామా షా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల లో రిజర్వేషన్లు కల్పించే లక్షంతో రాష్ట్ర ప్ర భుత్వం సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధిపై నిర్వహించిన సమగ్ర కులగణన స ర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జ స్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పా టు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ తన నివేదికను సోమవారం మంత్రివర్గ ఉప సంఘాని కి అందజేయనున్నారు. ఈ రెండింటిపై చర్చిం చి ఆమోదించడానికి మంగళవారం మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రిమండలి ఆ మోదించిన వెంటనే అదే రోజు ప్రత్యేకంగా అ సెంబ్లీ సమావేశమై దీనికి చట్టబద్ధత కల్పించనున్నది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
