
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో విషాదం నెలకొంది. సీజీవో టవర్స్ పై నుంచి దూకి ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. చనిపోయింది ఆదాయపు పన్ను శాఖ ఇన్స్పెక్టర్ జయలక్ష్మిగా నిర్ధారించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె సీజీవో టవర్స్లోని 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేఉకున్నారు.
………………………………………..