
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రెస్ అకాడమీని తిరిగి ఓపెన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రెస్ అకాడమీలో జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్, ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో చనిపోయిన, అనారోగ్యం బారిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జర్నలిస్టులకు, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడిరచారు. అలాగే మూతబడిన ప్రెస్ అకాడమిని ఈ నెల చివరిలోగా తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
…………………………………