
* తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింతా కృష్ణ ఆదివాసి
ఆకేరు న్యూస్ ములుగు : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములకు చట్టబద్దమైన రక్షణ కల్పించాలని తుడుం దెబ్బ ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులు శుక్రవారం కలెక్టర్ టిఎస్ దివాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ ఆదివాసి విలేకరులతో మాట్లాడారుజ జిల్లాలోని ఏటూర్ నాగారం మండలం శివాపురంలో పూర్వం నుంచి వట్టం, పూనెం వంశస్థులు నివసిస్తున్నారని అయితే వట్టం జనార్ధన్, పూనేం నాగేశ్వరరావు లకు అటవీ హక్కుల చట్టం పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ గిరిజనేతరులు వారి భూములను ఆక్రమించుకొనుటకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది గిరిజనేతరులు ఆదివాసీల భూములను ఆక్రమించుకొని ట్రాక్టర్ల సహాయంతో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ పోలీసు అధికారులకు తెలిపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారుజ ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తి సమాచారం సేకరించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ నాయకుడు నెమలి నర్సయ్యమాదిగ ,నాయక పోడ్ వ్యవస్థాపక పోలీట్ బ్యూరో సభ్యులు బొల్లెం సారయ్యనాయక పోడ్,మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల స్వామిమాదిగ, తుడుం దెబ్బ, ములుగు జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రమేష్ మాదిగ, తుడుం దెబ్బ కార్యదర్శి ఈక జగ్గారావు, నాయక పోడ్ దెబ్బ మహిళా విభాగం జిల్లా నేత పెరుమాళ్ళ భాగ్యలక్ష్మినాయక పోడ్, ఆదివాసీ నాయకులు కుర్సం ముత్తయ్య, ఉసం లావణ్య తదితరులు పాల్గొన్నారు.
………………………………………….