
* యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
* ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కాల్ చేయాలి
* సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం
* జిల్లా సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేయాలి
* అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ
ఆకేరు న్యూస్ ములుగుః జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ములుగు జిల్లా అడిషనల్ (రెవెన్యూ )కలెక్టర్ మహేందర్ జి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు జిల్లాను మత్తు పదార్థాల ,మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. యువత చెడు అలవాట్లు, వ్యసనాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడినట్లు తమదృష్టి కి వస్తె వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియ చేయాలన్నారు. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
రాష్ట్రం సరిహద్దు మార్గం ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున అధికారులు కటుదిటమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, జిల్లా లో ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని అన్నారు .ఈ దిశగా పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి అన్నారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో డి సి ఈ బి సెక్రటరీ, సూర్యనారాయణ, సామాజిక ఆసుపత్రి సూపర్డెంట్ మోహన్,డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్. దుర్గేశ్వర్ ,కె.సైదులు, జిల్లా బిసి అభివృద్ధి అధికారి, రవీందర్ రెడ్డి,పి. సురేష్, శ్రీనివాస్, ఎక్సైజ్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, రవాణా శాఖ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………..