
ఆకేరు న్యూస్, జనగామ: ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే విధానాలకు వ్యతిరేకంగా జూన్ 27వ తేదీన హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రూపొందించిన కరపత్రాన్ని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పట్ల నేరపూరిత నిర్లక్ష్యాన్ని వహిస్తూ ప్రైవేటు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారని కరపత్రంలో పేర్కొన్నారు. మేనిఫెస్టోలో విద్యా రంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తానని చెప్పి గత రెండు బడ్జెట్లలో కేటాయించింది 7.6% మించింది లేదు బడిబాట ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ఇప్పటికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన అందించడంలో విఫలమైంది, పూర్వ ప్రాథమిక విద్యకు ఒక ప్రణాళిక లేదన్నారు. ప్రతి తరగతికి ఒక గది ఒక ఉపాధ్యాయ పోస్ట్ ను కేటాయిస్తూ సరియైన మౌలిక సదుపాయాలను కల్పించాలి అలాగే విద్యాశాఖలో అనేక అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటివి విద్యారంగంలోని ఈ తిరోగమన మార్పులకు వ్యతిరేకంగా జూన్ 27న తేదీన జరుగుతున్న ధర్నాకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కరపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా బాధ్యులు ఎండి షరీఫ్, ఇమ్మడి అశోక్, శేషగిరిరావు, మండల బాధ్యులు చిదురాల శ్రీనివాస్, పోగు వెంకట నరసయ్య, ఎం శ్రీనివాస్, ఎస్ బుచ్చయ్య, ఏ.శ్రీనివాసులు, ఎన్ శ్రీనివాస్, విజయేందర్, పి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….