
ఆకేరు న్యూస్ తాడ్వాయిః ములుగు జిల్లా లోని కొండపర్తి గ్రామస్తులు శుక్రవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క చిత్ర పటాలకు పాలతో క్షీరాభిషేకం చేశారు. ఆదివాసీల గ్రామమైన కొండపర్తిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు. ఈ నేపధ్యంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ గ్రామం లో 45 ఇండ్లు, వ్యవసాయానికి 7 బోర్లు, మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు, మిర్చి, మసాలా , పసుపు,పౌడర్ తయారీ మిషన్లు అందించారు. ఈ గ్రామాభివృద్ధి కి కృషి చేస్తున్నందుకు శుక్రవారం గ్రామ ప్రజలు గవర్నర్ , మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరెం లచ్చు పటేల్ , ఇర్ప సీతారాములు,కల్తీ రమేశ్,ఇర్ప రామయ్య గ్రామ ప్రజలు మహిళలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
……………………………………………