HYDRA Commissioner AV Ranganath
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ సోమవారం తెలంగాణ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఒక కేసుకు సంబంధించి పూర్వపు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారంటూ ఆయన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
హైకోర్టు జారీ చేసిన స్పష్టమైన ఆదేశాల మేరకు రంగనాథ్ స్వయంగా విచారణకు హాజరుకావాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై వివరణ కోరింది.
