ACB Raid Keesara
* రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై, సీఐ
* రంగంలోకి దిగిన యాంటీ కరప్షన్ బ్యూరో..
ఆకేరు న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం సంచలన దాడులు నిర్వహించారు. ఓ నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన కీసర ఇన్స్పెక్టర్ (CI), సబ్-ఇన్స్పెక్టర్ (SI) ఏసీబీకి చిక్కారు.
* అసలేం జరిగిందంటే..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కీసర సీఐ ఆంజనేయులు ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ లంచం వ్యవహారంలో సీఐ తరఫున ఎస్సై జ్ఞానానందరెడ్డి డీల్ కుదిర్చారు. సీఐకి ముట్టజెప్పాల్సిన రూ. 5 లక్షల మొత్తాన్ని ఎస్సై తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
సీఐ, ఎస్సైల వేధింపులతో విసిగిపోయిన బాధితులు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్నారు.
*కానిస్టేబుల్, ఎస్సై పట్టివేత..
కీసర చెరువు ప్రాంతంలో బాధితుల నుండి రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానానందరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సీఐ ఆంజనేయులు పాత్రపై కూడా ఏసీబీ అధికారులు లోతుగా దరాజతు చేస్తున్నారు. స్టేషన్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలకమైన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
