
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దోస్త్ ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఈ నెల 12వ తేదీన సీట్లను కేటాయిస్తామని, సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.