
* ఒక్క కాంగ్రెసోళ్లే మోసగాళ్లు కాదు.. అంతకంటే పెద్ద మోసగాళ్లు బీజేపోళ్లు కూడా..
* రైతుల పక్షాన ఉండి గట్టిగా పోరాడుతాం
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, ఆదిలాబాద్ : గుజరాత్లో పత్తికి మద్దతు ధర ఇచ్చినట్టే.. తెలంగాణలో పండిరచిన పత్తికి కూడా మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే ఆదిలాబాద్లో ఉన్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వెంట పడుతాం.. వదిలిపెట్టమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటుచేసిన రైతు పోరుబాట మీటింగ్కు కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఒక్క కాంగ్రెసోళ్లే మోసగాళ్లు కాదు.. అంతకంటే పెద్ద మోసగాళుబీజేపోళ్లు కూడా. కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదు.. దొందు దొందే. ఇక్కడ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నారు. గుజరాత్లో పత్తి పండిరచే రైతు రైతు.. కానీ ఆదిలాబాద్లో పత్తి పండిరచే రైతు రైతు కాదా..? గుజరాత్లో పత్తికి రూ. 8800 మద్దతు ధర ఇస్తున్నారు.
మన తెలంగాణ ఆదిలాబాద్లో సీసీఐ ద్వారా రేపట్నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయట. గుజరాత్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మద్దతు ధర ఇవ్వకుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వెంటపడుతాం.. వదిలిపెట్టమన్నారు. పత్తి రైతులకు మధ్దతు ధర ఇవ్వాలి. రైతుబంధు, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడినట్టే.. బీజేపీ వెంట పడుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు.. భారత రైతు సమితి కూడా. రైతుల పక్షాన ఉండి గట్టిగా పోరాడుతామన్నారు. ఈ ప్రభుత్వానికి సంవత్సరికం కూడా పెట్టేది ఉందని.. ఇప్పుడే మొదలైంది పోరాటమన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదాకా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
…………………………………………..