* స్టేషన్ ఘన్పూర్ల్ లో వేడెక్కుతున్న రాజకీయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కడియం శ్రీహరి(KADIUM SRIHARI), తాటికొండ రాజయ్య(TADIKONDA RAJAYYA) మధ్య రాజకీయ వైరం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇద్దరి మధ్య సవాళ్లు, మాటల తూటాళ్లు పేలుతున్నాయి. తాజాగా నిన్ను పర్వతగిరికి పంపే వరకు నిద్రపోను.. అంటూ మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రాజయ్య వార్నింగ్(WARNING) ఇచ్చారు. అంతేకాదు.. స్టేషన్ ఘన్పూర్(STATION GHANPUR) నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం సవాలును స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు.
కడియం శ్రీహరి ప్రజా నాయకుడు కాదని.. రాజకీయ నాయకుడు మాత్రమేనని విమర్శించారు. కడియం స్థానికేతరుడు అని.. ఆయన్ను తప్పకుండా తరిమికొడతానని అన్నారు. ‘ నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే ఉంటా.. రేపు ఛస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు. ‘ అని చెప్పారు. కానీ నిన్ను స్థానికేతరుడిలాగే గుర్తిస్తారని కడియం శ్రీహరి(SRIHARI)ని ఉద్దేశించి రాజయ్య పేర్కొన్నారు. ఆయన్ను పర్వతగిరికి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు. మరోవైపు కడియం కూడా తీవ్రస్థాయిలో రాజయ్యపై విరుచుకుపడుతున్నారు. రాజయ్య పదవి లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే, రాజకీయాలను వదిలేస్తానని సవాల్(CHALLANGE) విసిరారు.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
