
* 8 మంది అరెస్టు
* నిందితులకు 10 రోజుల పాటు కస్టడీ
ఆకేరున్యూస్, బెంగుళూరు: ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపుల్లో స్కామ్కు పాల్పడిన కర్నాటక ఎగ్జామినేషన్స్ అథారిటీకి చెందిన 8 మంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఈఏకు చెందిన అధికారులు నవంబర్ 13న మల్లేశ్వరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా.. అడ్మిషన్ల సమయంలో కొందరు సీట్లు బ్లాక్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే 2024-2025 సంవత్సరానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్లను బ్లాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా.. మూడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన మేనేజ్మెంట్ను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం 8 మందిని అరెస్టు చేసినట్లు..దీనిలో ఒక కేఈఏ ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. కేఈఏ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద చీటింగ్, మోసం, ఐటీ యాక్టు నమోదు చేశారు.
……………………………..