Egg Prices Hit Rs8
ఆకేరు న్యూస్, డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిత్యం సామాన్యుడికి అందుబాటులో ఉండే చవకైన ప్రొటీన్ ఆహారమైన గుడ్డు.. ఇప్పుడు కొనాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.
* రూ. 6 నుంచి రూ. 8 కి చేరిన ధర…
హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సుమారు 15-20 రోజుల క్రితం ఒక్కో కోడిగుడ్డు రిటైల్ ధర రూ. 6 వరకు పలకగా, ఇప్పుడు అది ఏకంగా రూ. 8 కి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో కిరాణా దుకాణాల్లో ఒక గుడ్డును రూ. 7.50 నుంచి రూ. 8 వరకు విక్రయిస్తున్నారు.
* హోల్సేల్ మార్కెట్ & చికెన్ ధరలు…
ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) సమాచారం ప్రకారం.. హోల్సేల్ మార్కెట్లో వంద గుడ్ల ధర పెరగడంతో, సింగిల్ గుడ్డు హోల్సేల్ రేటు రూ. 6 నుండి రూ. 6.50 వరకు పలుకుతోంది. మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ. 280 నుండి రూ. 300 వరకు కొనసాగుతోంది.
ఉత్పత్తి వ్యయం పెరగడం, ఎండల ప్రభావం వల్ల గుడ్ల దిగుబడి తగ్గడంతోనే రేట్లు పెంచక తప్పలేదని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకునే సామాన్యుడికి ఈ ధరల పెరుగుదల పెద్ద భారంగా మారింది.
మరి మీ ఏరియాలో ప్రస్తుతం కోడిగుడ్డు ధర ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి!
Please tell us what is wrong. Your report will be sent to the website team.
