ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ-జిట్టేగూడెం శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చల్లా సుధీర్ రెడ్డి, వ్వవస్థాపకులు రాపోలు మధుసూదన్ రెడ్డి సర్పంచ్ లు మరపాక సుజన శ్రీనివాస్, బానోత్ బాలు ఆధ్వర్యంలో హుండీలు లెక్కించగా రూ. 2 లక్షల 3 వేల 738 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు ఎడమ కట్టమల్లు లూనావత్ రజిత రవీందర్ వార్డ్ సభ్యులు, ఏదునూరి సాంబయ్య, ఎండి అక్రమ్, బొంకురి యాదగిరి, అరాఫత్, రాజు రెడ్డి, సలీం కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.
…………………………………………………………………………….
