మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% నమోదు…
ఆకేరు న్యూస్, డేస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 48.54 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతంగా ఉన్న పోలింగ్, సమయం గడిచేకొద్దీ గణనీయంగా పెరిగింది.ఇక్కడ ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 51.66% పోలింగ్ నమోదైంది.కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ శాతం కొంత తక్కువగా (40.96%) ఉన్నప్పటికీ, క్రమంగా పుంజుకుంటోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలలో అత్యధికంగా 51.99% పోలింగ్ నమోదై విశేషంగా నిలిచింది.రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేయగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో తన ఓటును వేశారు.కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప గందరగోళం, గుర్తులకు సంబంధించిన చిన్నపాటి ఫిర్యాదులు మినహా, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటర్లు…సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
