ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది ఇద్దరికి గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి రాంనగర్ వైపు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బండ్లగూడకు చెందిన ఫాతిమా అనే మహిళ తన కొడుకు ఇబ్రహీం , కూతరు మోహిక్ తో కలిసి వెళ్తుండగా వీఎస్టీ చౌరస్తా వద్ద ప్రమాద వశాత్తు అటుగా వెళ్తున్న ఫైర్ ఇంజన్ వెనుక టైర్ కింద స్కూటీ పడింది. ఈ ప్రమాదంలో కూతురు మోహిక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తల్లీ కొడుకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..తల్లీ కొడుకులిద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
