ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి ఎఫ్సిడిఎ కమిషనర్ కె. శశాంక సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జిని పరిశీలించి ఆ గ్రామాలలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐ టి డి ఏ, సమావేశ మందిరంలో అధికారులతో భారీ వర్షాలు, వరదల పై సంసిద్ధత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరిష్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంత రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
