ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల పరిధి దేశాయి తండాలో సోమవారం బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామదేవతలకు (బొడ్రాయి) ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్య వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పల్లగుట్ట సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్, దేవస్థానం డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ తండావాసులు పాల్గొన్నారు.
Also Read :
