Free Cotton Seed Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ లో ‘కాపాస్ క్రాంతి యోజన’ పథకంలో నూజివీడు సీడ్స్ కంపెనీ 2200 పత్తి విత్తన ప్యాకెట్లను బుధవారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. నూజివీడు కంపెనీ రీజనల్ మేనేజర్ మురళీమోహన్, ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది.
కార్యక్రమంలో సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఏఈఓ ప్రవళిక నాగరాజు,గణేష్, వార్డు సభ్యులు రైతులు ఎనమల్ల కుమారస్వామి, కొమ్మ రాజుల రవి, సమ్మయ్య, నామల మల్లేశం, ఆగ్రోస్ రవి, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
