UNION MINISTER DHARMENDRA PRADHAN RESIGN
* దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
* నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి : విద్యార్థుల ఉద్యమం విజయం సాధించింది. ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖా మంత్రి దర్మేంధ్రప్రదాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం. మరో సారి పరీక్ష నిర్వహించడం లాంటి అంశాల వల్ల విద్యార్థులు ఆత్మహత్మ చేసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యంగా జంతర్ మంతర్ ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. విద్యార్థులపై అమానుషంగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ విద్యార్థులు ఉద్యమం కొనసాగించారు. దీంతో దేశంలోని అన్ని వర్గాలనుంచి తీవ్ర స్థాయిలో నిరసన , ఒత్తిడి పెరిగింది. తప్పని సరి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రదాన మంత్రి నరేంద్ర మోదికి పంపించారు.. గత పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని , తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని ప్రకటించారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాని దర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు..
—————————————
