
* ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణ
* సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని ఆరోపణ
* పిల్ దాఖలు చేసిన ఎమ్మెల్యే లు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి,రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి,మురళీ నాయక్
* ఆ నిర్మాణాలు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నాయి
* న్యాయ వాది చిక్కుడు ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : షేర్ లింగంపల్లి లోని ఖాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాజేశ్రెడ్డి, అనిరుద్రెడ్డి, మురళీనాయక్లు హైకోర్టులో పిల్ వేశారు. సర్వే నెంబర్ని మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని పిల్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 2023లో రంగారెడ్డి కలెక్టర్ నో ఆబ్జెక్షన్ పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్థులు నిర్మిస్తున్నారని న్యాయవాది చెప్పారు. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని న్యాయస్థానానికి వివరించారు.ఖాజాగూడలోని సర్వే నెం.119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని న్యాయవాది కోర్టుకు వివరించారు..ఓ ప్రైవేట్ పాఠశాలకు 150మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని న్యాయవాది తెలిపారు. దీనివల్ల పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఎమ్మెల్యేలు కోరారు. ఈ భూమికి సంబంధించి సీఎస్, ప్రతివాదులకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని పిటీషనర్లను సీజే ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
………………………………………….