
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట దొరికింది. ఈ మూడు కేసులను హైకోర్టు కొట్టేవేసింది. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్పై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తమ పేర్లను ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు పోలీసులు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకు మూడు పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని కేటీఆర్ హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ కె.లక్ష్మణ్ మూడు పిటిషన్లపై విచారణ చేపట్టారు. కేటీఆర్ తరపు న్యాయవాది రమణ రావు రాజకీయ కక్షల కారణంగా కేసు నమోదు చేశారని న్యాయస్థానానికి తెలపడంతో ఈ పిటీషన్పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. దీంతో కేటీఆర్పై నమోదైన కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
…………………………………………