* అదనపు షోలకు అనుమతినిచ్చిన డివిజన్ బెంచ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.. ఈ ఏడు సంక్రాంతికి మెగా స్టార్ నటించిన మన శంకర వర ప్రసాదా గారు, ప్రభాస్ నటించిన రాజాసాబ్ లు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు కోసం అటు మెగాస్టార్ అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన సీన్స్ సందడి చేస్తున్నాయి. సంక్రాంతి వేళ ఈ సినిమాలకు అదనపు షోలకు అనుమతి ఇస్తారో లేదో అనే అనుమానం సినిమా నిర్మాలకు.. ప్రేక్షకులకు ఉంది.వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ హైకోర్టు అదనపు షోలు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది, అదనపు షోల విషయంలో గతంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ సినిమాలకు వర్తించదని కోర్టు పేర్కొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు గేమ్ చేంజర్, పుష్ప 2, ఓజీ, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపింది. దీంతో అటు సినిమాల నిర్మాతలు ఇటు ప్రేక్షకులు ఊపిరి తీసుకున్నారు. ఇక సంక్రాంతికి సందడే సందడి…
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
