Mulugu Emergency Response Vehicle
ఆకేరు న్యూస్, ములుగు:
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మంజూరైన ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ) వాహనాన్ని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. భిక్షపతి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలు, బ్రేక్డౌన్ పరిస్థితులు, నిర్వహణ పనులు, దెబ్బతిన్న డీటీఆర్ల తరలింపు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అత్యవసర సేవలను వేగంగా అందించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు.
ములుగు డివిజన్ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ఈ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పి. నాగేశ్వరరావు డివిజనల్ ఇంజనీర్, ఎన్. వేణుగోపాల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, మహేందర్ ఏఈ కమర్షియల్, కృష్ణారావు ఏఈ టెక్నికల్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
