
* డీజీపీకి అందిన నివేదిక
* నివేదికలో కీలక అంశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాగరంలోని 42 ఎకరాల భూదాన్ భూమి (Bhudan Land)అన్యాక్రాంతం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈరోజు తెలంగాణ డీజీపీ(Telangana Dgp)కి నివేదిక అందించింది. నివేదికలో ఆసక్తికర విషయాలను పొందుపరిచింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(Amoy kumar), తహశీల్దార్ జ్యోతిలను విచారించిన అధికారులు తాజాగా వారి అరెస్టుకు సిఫారసు చేశారు. కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీవో , తహశీల్దార్ కలిసి ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ(ED) గుర్తించింది. దీని వలన అధికారులు కోట్లు రూపాయలు పొందినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేసింది. కలెక్టర్ తో పాటు తహసీల్దార్ జ్యోతి,ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ సూచించింది.
…………………………………………..