* ఆదేశాలు జారీచేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జి బాధ్యతలలను బై జయంత్ పాండాకు అప్పగించారు. ఈ మేరకు బైజయంత్ పాండాను ఎన్నికల ఇన్ చార్జిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. అలాగే కో ఇన్ చార్జిగా మురళిధర్ మోహల్ ను నియమించారు ఈ మేరకు నడ్డా ఎక్స్ వేదికగా తెలిపారు.ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బై జయంత్ పాండా బీజూ జనతా దళ్ తరపున 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఒడిషా లోని కేంద్రపారా నియోజకవర్గం నుంచి బీజేడీ అభ్యర్థిగా రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.2018లో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను బిజెడి నుండి సస్పెండ్ చేశారు. మార్చి 4, 2019న, పాండా భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ప్రతినిధిగా నియమితులయ్యారు.బైజయంత్ పాండా 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు, బిజు జనతాదళ్ (BJD) తరపున ఒడిశాకు ప్రాతినిధ్యం వహించారు. 2009 వరకు ఆయన రాజ్యసభలో వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు , అక్కడ ఆయన వివిధ కమిటీలలో చురుకుగా పాల్గొనడం మరియు జాతీయ స్థాయిలో ఒడిశా ప్రయోజనాల కోసం వాదించడం ద్వారా ప్రసిద్ధి చెందారు . రాజ్యసభలో తన పదవీకాలం తర్వాత, ఆయన ఒడిశాలోని కేంద్రపారా నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు . పాండా 2009 నుండి 2018 వరకు రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్నారు.2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రాపారా నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తనపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
కో ఇన్ చార్జిగా నియమితులైన మురళీధర్ కిసాన్ మొహొల్ మహారాష్ట్రలోని పూణె నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు,కేంద్ర సహకారం మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
