ACB Bribery Case Warangal
*10 వేల లంచం తీసుకున్న RI
*వారసత్వ భూమి మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్..
ఆకేరు న్యూస్, వరంగల్: అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (Anti-Corruption Bureau) మరోసారి వణుకు పుట్టించింది. సామాన్య ప్రజల నుండి పని కోసం లంచం డిమాండ్ చేసిన ఓ రెవెన్యూ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
*వారసత్వ భూమి కోసం..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) గా విధులు నిర్వహిస్తున్న గట్టికొప్పుల రాంబాబు, ఒక బాధితుడి నుండి తన వారసత్వ భూమికి సంబంధించిన ‘మ్యుటేషన్’ ప్రక్రియ పూర్తి చేయడానికి రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. ఫీల్డ్ ఎంక్వయిరీ నిర్వహించి, రిపోర్ట్ను తహశీల్దార్కు సమర్పించాలంటే ఈ మొత్తం చెల్లించాల్సిందేనని బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు.
*వేధింపులు భరించలేక…
అధికారి వేధింపులు భరించలేక బాధితుడు వారంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసిన ఏసీబీ అధికారులు, గురువారం (14.05.2026) నాడు తహశీల్దార్ కార్యాలయంలో బాధితుడి నుండి రాంబాబు లంచం తీసుకుంటుండగా మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
అరెస్టు చేసిన ఏసీబీ బృందం… నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకున్న రూ. 10,000 (Tainted Amount) నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారి చేతులకు నిర్వహించిన కెమికల్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో, ఆయన లంచం తీసుకున్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసిన ఏసీబీ బృందం, ఆయనను వారంగల్ లోని స్పెషల్ జడ్జ్ ఫర్ SPE & ACB కేసుల కోర్టులో హాజరుపరచనున్నారు.
*ఏసీబీ వారి విజ్ఞప్తి..
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని వారు భరోసా ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
