* హైదరాబాద్ లో సింగరేణి పెవిలియన్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రఖ్యాత బి.ఎం.బిర్లా విజ్ఞాన కేంద్రంలో సింగరేణి పెవిలియన్ ప్రారంభమైంది. ఈ పెవిలియన్ ను సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, జి.పి. బిర్లా పురావస్తు, ఖగోళ మరియు వైజ్ఞానిక సంస్థ ఛైర్పర్సన్ శ్రీమతి నిర్మల బిర్లా లు ప్రారంభించారు.ఈ పెవిలియన్ లో సింగరేణి ప్రాంతంలోని రామగుండం-1 ఏరియా మేడిపల్లి ఉపరితల గని వద్ద నాలుగేళ్ల క్రితం జరిపిన తవ్వకాలలో బయటపడిన 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలు, అతి పురాతన కాలానికి చెందిన శిలాజ కలపను ఈ పెవిలియన్ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏనుగులు 110 లక్షల ఏళ్ల క్రితం నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఏనుగు దంతాలతో కూడిన అవశేషాలు గతంలో నర్మదా నది తీరంలో లభించగా.. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతమైన మేడిపల్లి వద్ద దొరకడం విశేషం.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
