* ఎకరం భూమి రూ.104.74 కోట్లు!
* 66 ఎకరాల విక్రయానికి సర్కారు సన్నాహాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులోని భూముల వేలానికి సన్నాహాలు చేస్తోంది. నగర శివారులోని 66 ఎకరాలను జీటీఐఐసీతో విక్రయించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉస్మాన్సాగర్లో 46 ఎకరాలు, 13 ప్లాట్లు, రాయదుర్గంలో 4 ప్లాట్లు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. రాయదుర్గంలో 7.67 ఎకరాల భూమికి వేలం వేయనుంది. టీజీఐఐసీ ఎకరం భూమి ధర రూ.104.74 కోట్లుగా నిర్ధారించింది. అలాగే రాయదుర్గంలోని 15A/2 ప్లాట్కు మార్కెట్ ధర రూ.71.60 కోట్లుగా నిర్ణయించింది. టెండర్ దాఖలుకు ఆగస్టు 8వ తేదీ వరకు గడువు ఇచ్చింది. టీజీఐఐసీలో టెక్నికల్ ప్రజెంటేషన్తో ఆగస్టు 12వ తేదిన టెండర్ అవార్డు చేయనుంది.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
