రైలు ఢీకొని మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని రైలు 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
* ఘట్కేసర్ రైల్వేస్టేష్ వద్ద భయానక దృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైలు ఢీకొట్టడం (A train collision) తో చనిపోయిన ఓ వృద్ధుడి మృతదేహం (Old man’s dead body) ఇంజన్కు చిక్కుకుపోయింది. డ్రైవర్ గమనించకపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల వరకూ మృతదేహం రైలుకు వేలాడుతూనే ఉంది. ఘట్కేసర్ (Ghatkesar) వద్ద గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రైలును ఆపిచేయించి మృతదేహాన్ని బయటకు తీశారు. బీబీనగర్ (Bibinagar )- ఘట్కేసర్ (Ghatkesar) రైల్వేస్టేషన్ల (Railway stations) మధ్య గుర్తుతెలియని ఓ వృద్ధుడు పట్టాలు దాటుతుండగా.. వరంగల్ -సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు (Warangal – Secunderabad Passenger Train) ఢీ కొట్టింది. దీంతో ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కుని మృతిచెందాడు. మృతదేహం ఇంజన్కు వేలాడుతుండగానే.. రైలు 5 కిలోమీటర్ల వరకు ముందుకు వెళ్లిపోయింది. ఘట్కేసర్ రైల్వేస్టేష్ వద్ద స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
