Published:
Updated: 04 Sep 2024 • 09:34 AM
* సుమారు 200 హెక్టార్లలో కూలిచ చెట్లు
* ఘటనాస్థలిని పరిశృలించిన అటవీశాఖ అధికారి ప్రభాకర్
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సుమారు 200ల హెక్టార్లలో గాలివాన బీభత్సం సృష్టించింది. అడవుల్లో ఏర్పడిన సుడిగాలుల ప్రభావానికి సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. ఇటీవల పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. టోర్నడో వంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చి వేస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూలిన చెట్లను గమనిస్తే ఈదురు గాలులు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వీచినట్లు పేర్కొంటున్నారు. భారీ సంఖ్యలో చెట్లు నేలకొరగడంపై విచారణ చేపడుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
