Ponnam Varuna Yagam Telangana
ఆకేరు న్యూస్, హనుమకొండ:
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రత్యేకంగా ‘వరుణ యాగం’ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం తొలగిపోవాలని, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నలకు మేలు జరగాలని కోరుతూ స్వామివారికి పూజలు చేశారు.
అనంతరం రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.
