
* సుబేదారి పీఎస్ ఎదుటు ఉద్రిక్తత
* స్టేషన్ వద్దకు చేరుకున్న బీఆర్ ఎస్ శ్రేణులు
* సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
* సీఎం దిష్టి బొమ్మ దహనానికి యత్నం
* పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట
* కార్యకర్తలను మడికొండ స్టేషన్ కు తరలించిన పోలీసులు
* కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలిసిన బీఆర్ ఎస్ నాయకులు
* సుబేదారి పీఎస్ లో కౌశిక్ ను కలిసిన సతీమణి శాలినీ రెడ్డి
ఆకేరు న్యూస్ , హనుమకొండః వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను ఆయన కార్యాలయంలో బీఆర్ ఎస్ నాయకులు, బీఆర్ ఎస్ కు చెందిన లీగల్ టీం కలిసింది. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ పై కమిషనర్ తో చర్చించారు.కౌశిక్ రెడ్డి పై పెట్టిన సెక్షన్ల గురించి కమిషర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో లీగల్ అడ్వైజర్ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ బీఆర్ ఎస్ నాయకులకు తెలిపారు. ఇదిలా ఉండగా పాడి కౌశిక్ రెడ్డి తెల్లవారు జామున నాలుగు న్నర ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపధ్యంలో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు,పాడి కౌశిక్ రెడ్డి అభిమానులు పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా,సీఎం రేవంత్ రెడ్డికి వ్యవతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్లున్నారు. వారిని వారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో బీఆర్ ఎస్ నాయకులకు పోలీసులకు మద్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి..దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసులు మడికొండ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి సుబేదారి పోలీస్మస్టేషన్ లో తన భర్తను కలిశారు.గంటకు పైగా ఆమె కౌశిక్ రెడ్డి వద్ద ఉన్నారు. ఆ తరువాత ఆమె అక్కడినుంచి నేరుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటికి వెళ్లారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డిని కోర్టకు తరలించే వ్యవహారం ఒక హైడ్రామాగా మారింది.
…………………………………….