
* కాసేపట్లో మీడియా ముందుకు పార్టీ నేతలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులు కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత గొంత కాలంగా కవిత బీఆర్ ఎస్ పార్టీపై విమర్శలు చేస్తోంది.గతంలో బీఆర్ ఎస్ పార్టీ బీజేపీలో కలువబోతోందని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ ఎస్ లో దయ్యాలు ఉన్నాయంటూ ఆ దయ్యాల వల్లే పార్టీ పరువు పోతోందంటూ కామెంట్స్ చేశారు. తాజా గా కవిత నిన్న అమెరికా నుంచి వచ్చిన తరువాత ఆమె చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని రేవంత్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన నేపధ్యంలో కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు ఉన్నారని అందుకే హరీష్ రావును రెండో సారి బాధ్యతల నుంచి తప్పించారని చెప్పారు. అలాగే కేసీఆర్ కు సన్నిహితంగా వ్యవహరించే సంతోష్ రావుపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ మీద మరకలు పడడానికి ఈ ఇద్దరు నేతలే కారణమని ఆరోపించారు. గత పదేళ్లలో అధికారంలో ఉండగా వీరిద్దరు నేతలు లెక్కలేనంత ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని భావించిన పార్టీ నేతలు కవితను పార్టీనుంచి బహిష్కరించడానికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో పార్టీలోని కీలకనేతలు కవిత బహిష్కరణ విషయాన్ని మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది
కవిత కొత్త పార్టీ..?
త్వరలోనే కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కవిత బీసీ
నినాదం ఎత్తుకున్నారు. పలు వేదికల్లో ఆమె బీసీల అధికారం గురించి బీసీలకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడుతున్నారు, ఈ నేపధ్యంలో ఆమె పెట్టే పార్టీలో బీసీలను హైలెట్ చేయవచ్చని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె పెట్ట బోయే పార్టీకి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పేరు ఖరారు చేయవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
………………………………….