* ఆదర్శంగా నిలిచిన పాలకుర్తి తహసీల్దార్..
ఆకేరు న్యూస్,జనగామ: పాలకుర్తి మండల తహసీల్దార్ “సరస్వతి” సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇచ్చారు.సర్కార్ బడి అంటే చిన్న చూపు చూసే ఈ రోజుల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని చాటిచెబుతూ, తన కుమారుడిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతులు ఉన్న ఈ బడిని తహసీల్దార్ ఎంచుకున్నారు.ఈ పాఠశాల గతంలో ఉత్తమ ఫలితాలతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదిరాల శ్రీనివాస్ మరియు సిబ్బంది తహసీల్దార్ నిర్ణయాన్ని అభినందించారు. అధికారులే స్వయంగా తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించడం ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………….
