Kejriwal reacts on Dharmendra Pradhan Resignation
* ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప గౌరవం – అరవింద్ కేజ్రీవాల్
అకేరు న్యూస్, డెస్క్: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయంగా అభివర్ణించారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత,జెన్-జీ (Gen-Z) పోరాట ఫలితమని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఎంత ప్రయత్నించినా ప్రజల ఆగ్రహం ముందు ప్రభుత్వం తలవంచక తప్పలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
భవిష్యత్లో ఇలాంటి పేపర్ లీక్ ఘటనలు పునరావృతం కాకుండా నీట్ పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
